వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో రెండు స్వైన్ మరణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
బెంగుళూర్: కర్నాటకలో తాజాగా మరో రెండు స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయి. దీంతో కర్నాటకలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 73కు చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారులు గురువారం చెప్పారు. ఒకరు బెంగుళూర్ లో మరణించగా, మరొకరు బీజాపూర్ లో మరణించినట్లు వారు తెలిపారు. ఈ నెల 9వ తేదీన బెంగుళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన 35 ఏళ్ల వ్యక్తి ఈ నెల 15వ తేదీన మరణించాడు. బీజాపూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నెల 11వ తేదీన చేరిన 40 ఏళ్ల మహిళ మర్నాడు మృత్యువాత పడింది. వారిద్దరు కూడా స్వైన్ ఫ్లూ వల్లనే మరణించినట్లు 16వ తేదీన నిర్ధారణ అయింది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 214కు చేరింది.

వైద్య కళాశాలల విద్యార్థులను సర్వేకు నియోగించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు బిబిఎంపి నిఘా అధికారి మనోరంజన్ హెగ్డే చెప్పారు. కాగా బుధవారంనాడు మరో 14 తాజా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 6,800 మందికి స్వైన్ ఫ్లూ సోకింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X