నిజాంను కించపరిచారు: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తమ రాజు నిజాంను వలసవాదులు కించపరుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లికి నివాళులర్పించి, జాతీయ పతాకను ఆవిష్కరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజరిక వ్యవస్థకు ఉండే అవలక్షణాలన్ని నిజాంకు ఉన్నాయని, అయితే నిజాం చేసిన మంచి పనులు కూడా ప్రస్తావించకూడదని అనడం సరి కాదని ఆయన అన్నారు. ఎంతో మంది దేశభక్తులను పొట్టన పెట్టుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు చెందిన బ్రిటిష్ మిలటరీ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ కు గోదావరి నదిపై ఆనకట్ట కట్టినందుకు నివాళులర్పిస్తుంటే, నిజాంసాగర్ వంటి నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించిన నిజాంను స్మరించుకోవడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అంధ్రవలస దురాక్రణదారులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణకు చెందిన రాజులను, చరిత్రను, స్వతంత్రాన్ని ఆంధ్ర దురాక్రమణ దారులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి దురాక్రమణదారుల వక్రీకరణలను సహించబోమని, వారికి గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారంగా ప్రభుత్వం ఎందుకు నిర్వహించదని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 15వ తేదీని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా నిర్వహించడం న్యాయమని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర వక్రీకరణ భయంకరంగా జరుగుతోందని, వార్తా పత్రికలు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+