హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారు కొత్తగా రాలేదు: కెవిపి

By Staff
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: కొంత మంది మంత్రులు తన వద్దకు కొత్తగా రావడం లేదని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అన్నారు. వారి కలయికలో కొత్తేమీ లేదని ఆయన అన్నారు. గురువారం నాడు మంత్రులు వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి, కొణతాల రామకృష్ణ కెవిపి రామచందర్ రావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వారు కెవిపితో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

తనను కలిసిన మంత్రులు తన ఇంటికి రావడం కొత్తేమీ కాదని కెవిపి మీడియా ప్రతినిధులతో అన్నారు. రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. రఘువీరా రెడ్డి తనకు 35 ఏళ్లుగా తెలుసునని ఆయన చెప్పారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా కెవిపితో భేటీ అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X