హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపిపై వ్యాఖ్య సరి కాదు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావు బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యను ముఖ్యమంత్రి కె.రోశయ్య ఖండించారు. కెవిపిని విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే దర్యాప్తు సంస్థలకు అందించాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి కెవిపి బాధ్యత వహించాలని అనడం సరి కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా అన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి కెవిపి బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి బుధవారం అన్న విషయం తెలిసిందే.

వచ్చే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డి. శ్రీనివాస్ చెప్పారు. ధరల అదుపునకు పార్టీ తరఫున కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సలహాదారులు ఉండాలా, వద్దా అనే విషయంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, అది ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన అన్నారు. పని చేయని జిల్లా కోఆర్డినేటర్లను మార్చివేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X