హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలిసారి సి - బ్లాక్ నుంచి రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి గురువారం కె.రోశయ్య సచివాలయం సి - బ్లాక్ లో తన కార్యకలాపాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన పని చేయలేదు. ఆయన సి - బ్లాక్ లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగానే ప్రస్తుత ప్రభుత్వం నడుచుకుంటుందని రోశయ్య చెప్పారు. వైయస్ తలపెట్టిన అన్ని కార్యక్రమాలను చిత్తుశుద్ధితో అమలు చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఆయన సూచించారు. స్వైన్ ఫ్లూ, నిత్యావసర సరుకుల ధరలపై ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

నిత్యావసర ధరల అదుపునకు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. స్వైన్ ఫ్లూపై, గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దాన్ని కేవలం ఆరోగ్య శాఖకు చెందిన అంశంగానే చూడవద్దని, అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైన ఆరోగ్యశ్రీ అమలుపై అలసత్వం తగదని ఆయన హెచ్చరించారు. కరువు నివారణ చర్యలపై కూడా ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X