హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన స్వైన్ ఫ్లూ భూతం ఇప్పుడు పొరుగు జిల్లాలకు కూడా పాకుతోంది. తాజాగా బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎం) గ్రామానికి చెందిన బొడిగ ఎల్లమ్మ అనే మహిళ స్వైన్ ఫ్లూతో మరణించింది. కాగా, గురువారం ఉదయం హైదరాబాదులోని కామినేని ఆస్పత్రిలో చేతను అనే యువకుడు స్వైన్ ఫ్లూ లక్షణాలతో మరణించాడు. అతను ఖాసి వరంగల్ కు చెందినవాడు. నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీకి కూడా స్వైన్ ఫ్లూ సోకింది. ఈ వ్యాధికి ఆయన చికిత్స చేయించుకున్నారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఇటీవల ఒక పిల్లల వైద్యుడు మరణించాడు. అతను స్వైన్ ఫ్లూ వల్లనే మరణించినట్లు అనుమానిస్తున్నారు. బుధవారంనాడు హైదరాబాద్ లో స్వైన్ ప్లూ పరీక్షల నిమిత్తం 770 మంది ఆస్పత్రులకు వచ్చారు. వీరిలో 50 మంది నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 22 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విజయవాడలో 59 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు వచ్చాయి. వీటిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 17కు పెరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X