వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదురుకాల్పుల్లో పది మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Maoists
భద్రాచలం: ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పది మరణించారు. మృతుల్లో ఐదుగురు మావోయిస్టులు, ఐదుగురు పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఎదురుకాల్పులపై పోలీసులు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన కిష్టాపురం అటవీ ప్రాంతంలోని పాలచల్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లో ఉంటుంది.

కిష్టాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద యెత్తున సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ఎదురు పడ్డారు. ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ అయుధ కర్మాగారాన్ని కూడా కనుక్కున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X