వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సయిద్ పై కేసులు పెట్టిన పాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Hafiz Saeed
లాహోర్: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ మొహ్మద్ సయీద్ పై పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధ చట్టం కింద కేసులు నమోదు చేసింది. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ అతనిపై ఈ కేసులు పెట్టింది. అతనిపై రెండు కేసులు నమోదు చేయగా, అతని అనుచరుడు అబూ జందాల్ పై ఒక కేసును నమోదు చేసింది. వారిపై ఫైసలాబాద్ లో పాకిస్తాన్ కేసులు నమోదు చేసింది.

సయీద్ ఆగస్టు 27, 28 తేదీల్లో తన సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి జిహాద్ పిలుపునిచ్చినట్లు, ఇఫ్తార్ విందులకు హాజరవుతూ ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. జిహాద్ సమావేశాలకు సయీద్ విరాళాలు కూడా వసూలు చేశాడని వారన్నారు. భారత, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల, కార్యదర్శుల సమావేశాలు జరగనున్ననేపధ్యంలో సయీద్ పై పాక్ చర్యకు పూనుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X