వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిపై యువకుల దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

Proddatur
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులో కళాశాలకు వెళ్తున్న విద్యార్థినిపై ముగ్గురు యువకులు శనివారం ఉదయం దాడి చేశారు. ముఖాలకు దస్తీలు కట్టుకుని వారు బ్లేడుతో సౌజన్య అనే విద్యార్థినిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సౌజన్యను ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే మీడియాను లోనికి అనుమతించడం లేదు.

కళాశాలకు నడిచి వెళ్తున్న సౌజన్యపై ఆగంతకులు ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుటే దాడి చేశారు. గత మూడు రోజులుగా వారు ఆమె వెంట పడుతున్నారని, శనివారం ఉదయం దాడి చేసి పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులో తీవ్ర సంచలనం కలిగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X