వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లో మరో స్వైన్ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. తాజాగా మరో స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది. లక్ష్మి అనే మహిళ స్వైన్ ఫ్లూతో శనివారం మరణించినట్లు సమాచారం. ఆమె హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రిలో మరణించింది. రాష్టంలో ఇప్పటి వరకు 19 స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 24కు పెరిగింది. తాజాగా మరో 23 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

కాగా, ఇతర రాష్ట్రాల నిర్లక్ష్యం వల్లనే మన రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. స్వైన్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రివర్గం పూర్తిగా సహకరిస్తోందని ఆయన చెప్పారు. వైయస్ మరణాంతరం సంభవించినవి సాధారణ మరణాలంటూ వచ్చిన వార్తాకథనం కుట్రతో కూడుకున్నదని ఆయన విమర్శించారు. వార్తాకథనాన్ని ప్రచురించిన పత్రిక దర్యాప్తు చేసిన విధానాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X