వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మృతి: ముగ్గురు గల్లంతు

By Staff
|
Google Oneindia TeluguNews

Godavari
రాజమండ్రి: గోదావరి నదిలో పడవ మునిగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు జాడ తెలియాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పాపికొండలు సమీపాన గల మెట్టగూడెం వద్ద శనివారం సాయంత్రం నాటుపడవ గోదావరి నదిలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పడవలో ప్రయాణిస్తున్న 27 మంది న్యాయవాదులు, వ్యాపారుల్లో 22 మంది సురక్షితంగా బయట పడ్డారు. మిగతా ఐదుగురిలో ఒకరి మృతదేహాన్ని శనివారం సాయంత్రం వెలికి తీయగా, మరొకరి మృతదేహాన్ని ఆదివారం ఉదయం వెలికి తీశారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు.

మృతులను రామకృష్ణ, రాఘవలుగా గుర్తించారు. వీరిలో ఒకర న్యాయవాది కాగా, మరొకరు వ్యాపారి. మరణించిన, గల్లంతైన ఐదుగురిలో నలుగురిది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాగా, ఒకరిది కొవ్వూరు. రాజమండ్రి నుంచి శివగిరికి వచ్చి 16 మంది న్యాయవాదులు నాటు పడవ మాట్లాడుకుని ఖమ్మం జిల్లా కొల్లూరుకు ప్రయాణం సాగించారు. అయితే మధ్యలో పడవ మునిగిపోయింది. పడవ ప్రమాదం గుర్తించిన కొందరు నీళ్లలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వారు పడవలోని ఉండిపోవడంతో మునిగిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X