వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో మరో సారి భూకంపం

By Staff
|
Google Oneindia TeluguNews

Assam
గౌహతి: భారత ఈశాన్య ప్రాంతాల్లో, మయన్మార్ లో మంగళవారం మరోసారి భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిచర్ స్కేల్ పై 5.7గా నమోదైంది. సోమవారం సంభవించిన భూకంపంలో భూటాన్ లో మరణించినవారి సంఖ్య 11కు చేరుకుంది. మయన్మార్ కేంద్రంగా మంగళవారం తెల్లవారు జామున ఒంటి గంటా 8 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ల్లో, మయన్మార్ లను ఈ భూకంపం తాకింది.

మంగళవారంనాటి భూకంపంలో ప్రాణ నష్టం సంభవించినట్లు వెంటనే ఏ విధమైన వార్తలు రాలేదు. సోమవారం నాటి భూకంపం భయం మనసుల నుంచి తొలగక ముందే మంగళవారం ప్రజలు మరింత భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూటాన్ లో సంభవించిన నష్టంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X