వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చల్లగా ఉండాలి: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
తిరుపతి: రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని తాను తిరుచునూరు పద్మావతిని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఆయన మంగళవారంనాడు తిరుచునూర పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలకు సుఖసౌఖ్యాలు ప్రసాదించాలని పద్మావతి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తమలాంటి వారికి బుద్ధి కుశలతను ప్రసాదించి ప్రజలకు మంచి పాలన అందించే యోగ్యతను కల్పించాలని కూడా కోరుకున్నట్లు ఆయన చెప్పారు.

సోమవారం సాయంత్రం ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పట్టు పస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన అక్కడే బస చేసి మంగళవారం ఉదయం తిరుచునూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో కలిసి హైదరాబాదుకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం చిరంజీవి తిరుపతిలో రోశయ్యను కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X