హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరోగ్యాధికారికి స్వైన్ ఫ్లూ పరీక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం స్వయంగా మంగళవారం స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాదు ఎర్రగడ్డలో గల ఛాతీ ఆస్పత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య సౌమ్య, కూతురు అపర్ణ కూడా పరీక్షలు చేయించుకున్నారు. టామీ ఫ్లూ మాత్రలు వాడాల్సిందిగా వైద్యులు అపర్ణకు సూచించారు.

అపర్ణ ఇటీవల మహారాష్ట్రలోని పూణేకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమెకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. ఇటీవల నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీ స్వైన్ ఫ్లూ వ్యాధికి చికిత్స చేయించుకుని కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో 36 మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X