సిఎం రోశయ్యపై హైకోర్టులో పిల్
రాజ్యాంగంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే పదం లేకపోయినప్పటికీ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనందున రోశయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభలో రోశయ్య బలనిరూపణకు సిద్ధపడాల్సి ఉంటుంది. తనకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల జాబితాను ఆయన గవర్నర్ కు సమర్పించలేదు. మెజారిటీ శాసనసభ్యులున్న కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ రోశయ్యను తన నాయకుడిగా ఎన్నుకోలేదు. దీంతో ఆయనకున్న బలంపై సందేహాలున్నాయనేది వాదన.
Comments
Story first published: Wednesday, September 23, 2009, 13:37 [IST]