చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీవ్ కిల్లర్ నళిని దీక్ష విరమణ

By Staff
|
Google Oneindia TeluguNews

Nalini
చెన్నై: తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా చేస్తున నిరాహార దీక్షను రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని బుధవారం విరమించుకుంది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని వెల్లూరు జైలులో జీవిత ఖైదు అనుభవిస్తోంది. ఆమె విజ్ఞప్తిని చట్ట ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకుంటామని జైలు అధికారులు హామీ ఇవ్వడంతో నళిని దీక్షను ఉపసంహరించుకుంది.

బుధవారం ఉదయం జైలు అధికారులు ఆమెకు హామీ ఇచ్చి దీక్ష విరమించాలని సూచించారు. దీంతో ఆమె దీక్ష విరమించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమె భర్త మురగన్ కూడా వెల్లూరు జైలులోనే ఉన్నాడు. గత 18 నెలలుగా నళిని జైలు జీవితం గడుపుతోంది. తనను గడువు కన్నా ముందు విడుదల చేయాలని నళిని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X