ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస కీలక నేతల అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

TRS Leaders
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో తమ అసమ్మతి శాసనసభ్యుడు అరవింద్ రెడ్డిపై ప్రజాకోర్టు నిర్వహించడానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాకోర్టు నిర్వహణకు అనుమతి ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని, కొంత మంది ఉపాధ్యాయులను కూడా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తెరాస కార్యకర్తల ఇళ్లపై కూడా దాడులు చేస్తూ వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాలలో 144వ సెక్షన్ విధించారు.

మంచిర్యాలకు బయలుదేరిన తెరాస నేత నాయని నర్సింహారెడ్డి, నారదాసు, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, వినయ్ భాస్కర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలలో ప్రజాకోర్టు నిర్వహించి తీరుతామని నాయని నర్సింహారెడ్డి అంటున్నారు. పోలీసులు ప్రజాకోర్టు నిర్వహణకు అనుమతి నిరాకరించారు. కోర్టుకు వెళ్లయినా సరే ప్రజాకోర్టు నిర్వహణకు అనుతి తెచ్చుకుంటామని నాయని అంటున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు మంచిర్యాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X