హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వైన్ ఫ్లూతో బాలుడి మృతి?

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: హైదరాబాద్ లోని కింగ్ కోఠీలో గల ఆదిత్య ఆస్పత్రిలో ఒక బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. అతను స్వైన్ ఫ్లూ వల్లనే మరణించినట్లు అనుమానిస్తున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మరణించాడని బాలుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, హన్మకొండలో నాగభైరవ అనే విద్యార్థికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. హన్మకొండలోని కాకతీయ కాలనీకి చెందిన అతను గురువారం ఆస్పత్రికి వచ్చాడు. అయితే అతను వైద్యుల నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో స్వైన్ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X