హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డి శ్రీనివాస్ కు వైయస్ జగన్ షాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వైయస్ జగన్ మానియా షాక్ ఇస్తోంది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టబోమని కాంగ్రెస్ నాయకులు తెగేసి చెబుతున్నారు. గురువారం మూడో రోజు డి. శ్రీనివాస్ కర్నూలు, కరీంనగర్, మెదక్, ప్రకాశం జిల్లాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనకు ప్రకాశం, కరీంనగర్ జిల్లాల నేతల నుంచి, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టకూడదని ప్రకాశం జిల్లాలో యువజన కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ను అడ్డుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కరీంనగర్ జిల్లా నేతలు అన్నారు. టెలికాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత జగన్ కు మద్దతుగా కాంగ్రెసు కార్యాలయంలో పెద్ద యెత్తున నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X