హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాదులో వ్యక్తి దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: సికింద్రాబాదులోని సరస్వతీనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య గురువారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. మాలిని అనే మహిళ బుధవారం నాలాలో కొట్టుకుపోయి మరణించింది. హత్యకు గురైన వ్యక్తిని మాలిని బావ సంపత్ గా గుర్తించారు. నలుగురు వ్యక్తులు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంపత్ ను ఇంట్లోంచి బయటకు పిలిచి రాళ్లతో కొట్టి గొంతు కోసి హత్య చేశారు. మాలిని కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్లు సంపత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాలినిని ఆమె భర్త రమేష్, సంపత్ కలిసి హత్య చేశారనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సంపత్ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X