వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాబిల్లిపై నీరు ఎక్కువే: మాధవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Moon
బెంగుళూర్: చంద్రుడిపై అంచనాకు మించి నీరు ఉన్నట్లు తేలిందని ఇస్రో చైర్మన్ జి. మాధవన్ నాయర్ చెప్పారు. ఇది ఇస్రో సాధించిన గొప్ప విజయమని ఆయన అన్నారు. చంద్రయాన్ - 1 పూర్తిగా విజయవంతమైందని ఆయన అన్నారు. చంద్రయాన్ అద్భుతమైన పని చేసిందని, అది 95 శాతం ఫలితం సాధించిందని తాను ఇంతకు ముందు అన్నానని, 110 శాతం విజయం సాధించిందని ఇప్పుడు చెప్పగలుగుతున్నానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

చంద్రయాన్ ప్రధాన లక్ష్యం నెరవేరిందని, చందమామపై నీరుందని కనిపెట్టడం గొప్ప విజయమని తాను ప్రపంచానికి చాటి చెప్పగలనని ఆయన అన్నారు. చంద్రయాన్ సేకరించిన వివరాలను విశ్లేషించడానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల కాలం పడుతుందని ఆయన అన్నారు. చంద్రుడి ధృవ ప్రాంతంలో జలం, హైడ్రాక్సైల్ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. జలం సముద్ర, సరస్సు రూపాల్లో గానీ బిందువుల రూపాల్లో గానీ లేదని, చందమామపై గల ఖనిజాలతో కలిసి ఉందని ఆయన వివరించారు. అటువంటి పదార్థాలు అంచనాకు మించే ఉన్నాయని ఆయన అన్నారు.

చంద్రుడిపై జలం ఎలా ఉందనేది ఇప్పటికీ ఆశ్చర్యమేనని ఆయన అన్నారు. చంద్రుడి ఉపరితలంపైకి నిరంతరాయంగా వీస్తున్న సౌర గాలుల వల్ల జలం తయారై ఉండవచ్చునని ఆయన అన్నారు. సౌర గాలుల్లో ఉండే హైడ్రోజన్ చంద్రుడి ఉపరితలంపై గల ఖనిజాల్లోని ఆక్సిజన్ తో కలిసి జలం ఏర్పడి ఉంటుందని ఆయన వివరించారు. జలం పరమాణువులు ఉన్నంత మాత్రాన చంద్రుడిపై జీవనం సాగించడానికి వీలవుతుందని చెప్పలేమని ఆయన అన్నారు. చంద్రుడిపై శాశ్వత పునాది ఏర్పాటుకు అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X