హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో మేజర్ సూరి భౌతిక కాయం

By Sridhar L
|
Google Oneindia TeluguNews

Jammu & Kashmir
హైదరాబాద్: మేజర్ జె. సురేష్ సూరి భౌతిక కాయం గురువారం రాత్రి హైదరాబాదుకు చేరుకుంది. ఆయన భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం బన్సీలాల్ పేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ లోని బందిపొరాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో సూరి మృతి చెందారు. త్రివర్ణ పతాకంతో అలకరించిన పేటికలో సూరి భౌతిక కాయాన్ని ఉంచారు. శ్రీనగర్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీకి తరలించి ఆ తర్వాత హైదరాబాదుకు శుక్రవారం రాత్రి విమానంలో తరలించారు.

సూరి బందిపొరాలో ఏడాది క్రితం విధుల్లో చేరారు. ఆయనకు భార్య పల్లవి, తల్లి గిరిజ ఉన్నారు. ఆయన నిరుడు ఆగస్టులో పల్లవిని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 5వ తేదీన భార్యతో కలిసి ఆయన తన జన్మదినాన్ని జరుపుకోవాల్సి ఉంది. సూరి 8 ఏళ్ల క్రితం సైన్యంలో చేరారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆగస్టు 28వ తేదీన తన వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. పల్లవితో పాటు ఆయన సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీకి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X