వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో 8 మంది ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

Suicide
గుంటూరు: గుంటూరు జిల్లాలో రెండు కుటుంబాలు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డాయి. రెండు కుటుంబాలకు చెందిన 8మంగి ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, కుటుంబ కలహాలతో వారు ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం వడ్లమూడిపాలెంలో ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.

అమరావతిలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ నిత్యాన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన వెంకటేశ్వరరావు భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు మౌనిక, జ్ఞానేష్ లకు కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగించారు. అనంతరం భార్యాభర్తలు ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వారు ఒక లేఖ రాసి పెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X