వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20కి పైగా విమానాల రద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

Air India
న్యూఢిల్లీ: పైలట్ల సమ్మెతో ఎయిర్ ఇండియా 20కి పైగా విమానాలను రద్దు చేసింది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన విమానాలు 15 ఉన్నాయి. వచ్చే 15 రోజుల పాటు బుకింగ్ ను కూడా ఆపేసింది. పైలట్లు చేస్తున్న సమ్మె మంగళవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ప్రోత్సాహకాలపై సంస్థ యాజమాన్యానికి, ఎగ్జిక్యూటివ్ పైలట్లకు మధ్య జరిగిన చర్చలు సోమవారం విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతోంది.

పైలట్లు సిక్ లీవులు పెట్టడంతో బెంగుళూర్, కోల్ కత్తా, చెన్నై, గౌహతి, ముంబై తదితర ప్రదేశాలకు వెళ్లే పది దేశీయ విమానాలు, కాబూల్, ఖాట్మండ్, న్యూయార్క్, లండన్, చికాగోలకు వెళ్లాల్సిన ఐదు విదేశీ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విలీనానికి ముందు చేరిన ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా చేరడంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. శనివారం నుంచి ఎగ్జిక్యూటివ్ పైలట్లు సిక్ లీవులు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రతి రోజు 55 విమానాలను నడుపుతుంది. అయితే మంగళవారం సాయంత్రం నుంచి 16 విమానాలను మాత్రమే నడపాలని నిర్ణయించింది. పైలట్ల అందుబాటును బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది. చెన్నై, ముంబై, కోల్ కత్తాల నుంచి మంగళవారం ఉదయం బయలుదేరాల్సిన దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X