హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరూపిస్తే రాజకీయ సన్యాసం: దానం

By Staff
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం సంభవించినవి సహజ మరణాలే అని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ తమ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావును సవాల్ చేశారు. రాష్ట్రం ఓ మహానేతను కోల్పోవడంతో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలు గుండెలు ఆగి మరణించారని, వాటిని బోగస్ అని హనుమంతరావు అనడం ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ మృతితో దుఖసాగరంలో మునిగిన రాష్ట్రం దసరా పండుగను కూడా సరిగా నిర్వహించుకోలేదని ఆయన అన్నారు.

వైయస్ మరణాంతరం సంభవించిన మరణాలపై జిల్లాలవారీగా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని ఆయన చెప్పారు. మీడియాలో ప్రచారం పొందడానికి హనుమంతరావు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ నల్లకాలువలో వైయస్ సంతాప సభకు వెళ్లారు తప్ప రాజకీయ సభకు వెళ్లలేదని, దీన్ని కూడా సీనియర్ నేతలు వివాదాస్పదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు తాము మౌనంగా ఉన్నామని, కానీ హనుమంతరావు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. మౌనంగా ఉన్నంత మాత్రాన తాము చేతకానివాళ్లం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X