వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్నాడేకు ఫాల్కే అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

Manna Dey
న్యూఢిల్లీ: ప్రముఖ నేపథ్య గాయకుడు మన్నాడేకు 2007కు గాను ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ అవార్డుకు ఐదుగురు సభ్యుల కమిటీ మన్నాడే పేరును ఖరారు చేసినట్లు సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం చెప్పారు. ఈ 90 ఏళ్ల గాయకుడు అక్టోబర్ 21వ తేదీన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఆ అవార్డును అందుకుంటారు.

భారతీయ సినిమాకు సంబంధించి అద్భుతమైన గాయకుల్లో మన్నాడే ఒకరు. ఆయన 1950, 1970 మధ్య కాలంలో 20 ఏళ్లకు పైగా చలన చిత్ర సీమను ఏలారు. తన గానమాధుర్యంతో ప్రేక్షకులను మైమరిపించారు. ఈ కాలంలో రఫీ, కిశోర్ కుమార్ లతో పాటు మన్నాడే కూడా హిందీ చలనచిత్ర రంగాన్ని తన గాత్రంతో ఏలారు. భారత సినీ రంగానికి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అత్యున్నతమైంది. మన్నాడే 3,500కి పైగా పాటలు పాడారు. ఆయనకు ఇప్పటికే పద్రశ్రీ, పద్మభూషన్ అవార్డులు లభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X