గాంధీ జయంతికి 947 మంది జీవితఖైదులు విడుదల
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 947 మంది సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని నిర్ణయించినా జి.సతీష్ అనే న్యాయవాది ఈ విషయమై సుప్రీం కోర్టులో కేసు వెయ్యడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ సుప్రీం కోర్టు ఆయన పిటీషన్ తిరస్కరించడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు హోం మినిష్టర్ సబితా ఇంద్రా రెడ్డి పలుమార్లు జైళ్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి అర్హులైన ఖైదీల జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జైళ్ల శాఖకు ప్రభుత్వం గురువారం పంపనుంది.
Comments
hyderabad హైదరాబాద్ కాంగ్రెస్ nd tiwari ys rajasekhar reddy sabitha indra reddy వైయస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రా రెడ్డి గాంధీ జయంతి
Story first published: Thursday, October 1, 2009, 14:09 [IST]