హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెయిల్ కోసం 'సత్యం' రాజు పిటీషన్

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు బైర్రాజు రామలింగరాజు తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని మరో సారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇటీవలే గుండె పోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన రాజు తన అనారోగ్యాన్ని కారణంగా చూపి బెయిలో మంజూరు చెయ్యాలని కోర్టుని అభ్యర్థించాడు. ఆయన పిటీషన్ వివరాలు ఈ విధంగా వున్నాయి. "తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న తనకు 48 నుండీ 72 వారాల పాటు ప్రత్యేక చికిత్స నిర్వహించాలని వైధ్యలు నిర్ణయించిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేసి తన జీవించే హక్కుని కాపాడాలని కోర్టుని కోరారు".

కాలేయానికి సంబంధించిన హెపటైటిస్-సీ వ్యాధితో బాధపడుతున్న తనకు పరిశుభ్రమైన వాతావరణంలో 24 గంటలు వైధ్యుల పర్యవేక్షనలో చికిత్స అవసరమని నిమ్స్ వైధ్యులు తేల్చారని అందువల్ల కుటుంబసభ్యుల పర్యవేక్షణలో తనని వుంచాల్సిన అవసరం వుందని, జైలులో లేకపోయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అనారోగ్యంతో బాధపడుతున్న తాను సాక్షాలను తారుమారు చేసే వీలు లేదని, కనుక దయుంచి తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని తన అభ్యర్థనలో పేర్కన్నారు. కాగా ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X