హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తేరుకుంటున్న కర్నూలు, మంత్రాలయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool
హైదరాబాద్: కర్నూలు, మంత్రాలయాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. 24 గంటల పాటు వరద నీటిలో చిక్కుకున్న ఈ రెండు ప్రాంతాల్లో వరద నీరు శనివారం ఉదయానికి కాస్తా తగ్గాయి. మంత్రాలయం, కర్నూలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే కర్నూలు జిల్లాలోని నంద్యాలకు వరద ముప్పు పొంచి ఉంది. కాగ్నానది పొంగిపొర్లుతోంది. కర్నూలులో రెండు అడుగుల మేర నీరు తగ్గినట్లు సమాచారం. మహబూబ్ నగర్ లో కూడా పరిస్థితి మెరుగుపడుతోందని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. సహాయ చర్యలు చేపట్టడానికి పరిస్థితి అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కర్నూలులో ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాత్రంతా సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన ఆయన శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

బీచ్ పల్లి - కర్నూలు రహదారిపై పెద్ద యెత్తున నీరు చేరడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకంగా మారిందని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. పైన వర్షాలు పడకపోతే ఇన్ ఫ్లో పెరగకపోతే పరిస్థితి చక్కబడుతుందని ఆయన చెప్పారు. మంత్రాలయంలోని భక్తులను రక్షించినట్లు అధికారులు చెప్పారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ మునిగిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X