విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పడవ బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Avanigadda
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక వద్ద సోమవారం సాయంత్రం పడవ బోల్తా పడింది. పడవలో 11 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. లంక గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పడవలో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైనవారి కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. సైన్యం కూడా రంగంలోకి దిగింది. పడవలో ప్రయాణిస్తున్న 9 మందిని వారు రక్షించగలిగారు. అయితే ఇద్దరు చిన్నారులు మాత్రం మృత్యువాత పడ్డారు. అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డ అక్విడెక్ట్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో అవనిగడ్డ మండలంలోని గ్రామాలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది.

కాగా, గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొళ్లూరు వద్ద వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లాను వరద తాకిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రాణ నష్టం పెద్దగా సంభవించలేదు. విజయవాడకు హైదరాబాద్ నుంచి రాకపోకలు స్తంభించాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం పున్నెవల్లి గ్రామం వద్ద సోమవారం ఓ వ్యక్తి వరదలో చిక్కుకుని మృతి చెందాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X