హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వైన్ ఫ్లూకు మరో నలుగురు బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Swine Flu
న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ వ్యాధికి మహారాష్ట్రలో తాజాగా మరో నలుగురు బలయ్యారు. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి వల్ల మరణించినవారి సంఖ్య 344కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో ఇద్దరు ఆదివారం మరణించగా, మరో ఇద్దరు శనివారమే మరణించారు. అయితే ఈ మరణాలను ఆదివారం ధృవీకరించారు. మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 139కి పెరిగింది. స్వైన్ ఫ్లూ వల్ల అత్యధికంగా మహారాష్ట్రలోనే మృతి చెందారు.

తాజాగా మరో 164 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య దేశంలో 10,894కు చేరుకుంది. తొలి స్వైన్ ఫ్లూ కేసు హైదరాబాదులో మేలో నమోదైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,024 కేసులున నమోదయ్యాయి. ఢిల్లీలో 2,800 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X