కర్నూలు బాధితుల హాహాకారాలు
కర్నూలు జిల్లాలోని కృష్ణా నది ప్రవాహానికి విలవిలలాడిన బండి ఆత్మకూరు, నందికొట్కూరు తదితర మండలాల్లో 40 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. ఐడు గ్రామాల ప్రజల ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఏడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. తుంగభద్ర వరద తాకిడికి 34 మండలాలు గురయ్యాయి. బాధితులు దాదాపు ఐదున్నర లక్షల మంది ఉంటారు. లక్షన్నర మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. కెసి కెనాల్, తుంగభద్రలకు మధ్య ఉన్న ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఐదున్నర లక్షల ఎకరాల పంట మాత్రమే నష్టమైందని చెబుతున్నప్పటికీ నష్టం రెట్టింపు ఎకరాల్లో ఉంటుందని చెబుతున్నారు.
Comments
కర్నూలు kurnool ఆత్మకూరు వర్షాలు krishna river కృష్ణా నది floods వరద బాధితులు flood victims తుంగభద్ర tungabhadra
Story first published: Monday, October 5, 2009, 14:00 [IST]