వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వండిన పదార్థాలు పంపొద్దు: కలెక్టర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboob Nagar
మహబూబ్ నగర్: వరద బాధితులకు వండిన ఆహార పదార్థాలు పంపవద్దని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ దమయంతి విజ్ఞప్తి చేశారు. వండిన పదార్థాలకు బదులు వంట సామగ్రి అందించాలని ఆమె ప్రజలు కోరారు. వరద బీభత్సానికి పూర్తిగా నిరాశ్రయులైన వారికి 8 వేల రూపాయలేసి, పాక్షికంగా ఇళ్లు దెబ్బ తిన్నవారికి 7 వేర రూపాయలేసి నష్టపరిహారం అందిస్తామని ఆమె మంగళవారం చెప్పారు. ఒక వేళ ఆహారాన్ని సరఫరా చేస్తే పునరావాస కేంద్ర ఇంచార్జీ పరిశీలించిన తర్వాతనే పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. కొన్ని ఆహార ప్యాకెట్లు, నీళ్లు విషపూరితమైన నేపథ్యంలో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.

నీట మునిగిన ఆలంపూర్ లోని నీటిని మోటార్ల ద్వారా తోడి వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛంద సంస్థలు అందజేసే ఆహారం, వాటర్ ప్యాకెట్లపై నిషేధించారు. కాగా, వడ్డేపల్లి వరద తాకిడి ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, లక్ష్మణ్ పర్యటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X