హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యను కలిసిన జూ ఎన్టీఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. వరద బాధితుల సహాయం కోసం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. సాటి మానవుడిగా, సాటి ఆంధ్రుడిగా తన వంతు సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్లు ఆయన అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తన తాత స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా బాధితులను ఆదుకున్నారని, ఆయన అడుగు జాడల్లో నడిచే వాడిగా తాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చానని ఆయన చెప్పారు. వరద బాధితులను చూడాలని తనకు ఉందని, అయితే ప్రభుత్వం చేపట్టే సహాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని తాను వెళ్లడం లేదని ఆయన చెప్పారు. వరద బాధితులను పరామర్శించడానికి తర్వాత వెళ్తానని ఆయన చెప్పారు. సాటి మానవుడిగా కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X