హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహాయం ముమ్మరం చేయండి: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల అమలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వరద ఉధృతి తగ్గినందున సహాయక చర్యల అమలును ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరద తాకిడి ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అందువల్ల వాటి నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో వసతులకు కొరత లేకుండా చూడాలని ఆయన ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X