వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం విఫలమైంది: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మహబూబ్ నగర్: వరద ముప్పును నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. వరద ముప్పును పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే నష్టం తగ్గి ఉండేదని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వరద బాధితులను ఆయన బుధవారంనాడు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన పెబ్బేరులో బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. వరదలు వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఆదుకోవడానికి అధికారులు ముందుకు రాలేదని ఆయన అన్నారు. తాను ఎవరినీ తప్పు పట్టడానికి రాలేదని, బాధితులను పరామర్శించడానికి మాత్రమే వచ్చానని ఆయన చెప్పారు.

తాను రెండు రోజులు వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించానని, పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన చెప్పారు. వర్షాలు రాకపోతే ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని, అయితే వర్షాలు భారీగా వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికారులు స్పందించలేదని ఆయన విమర్సించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X