తగ్గుతున్న కృష్ణా వరద ఉధృతి
కృష్ణా కరకట్టలకు ఎక్కడా లీకేజీలు ఎక్కడా లేవని నీటి పారుదల శాఖ అధికారుల చెబుతున్నారు. అయితే గుంటూరు జిల్లా మాత్రం ఇంకా వరదలతో విలవిలలాడుతూనే ఉన్నది. రేపల్లే పట్టణంలో నాలుగు అడుగుల మేర నీరు చేరి ఉంది. నిత్యావసర సరుకుల కోసం రేపల్లే వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పెనుమూడి - రేపల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. వల్లభాపురం వద్ద స్లూయిజ్ కాలువ గేటు కొట్టుకుపోయింది. దానికి మరమ్మతులు చేయలేదు.
Comments
guntur గుంటూరు vijayawada విజయవాడ Krishna కృష్ణా nagarjuna sagar నాగార్జున సాగర్ floods వరదలు ప్రకాశం బ్యారేజీ prakasam barrage
Story first published: Wednesday, October 7, 2009, 8:35 [IST]