హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ ఎస్పీ యాదవ్ పై వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

SSP Yadav
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఫైలుపై బుధవారం సంతకం చేశారు. వివాదాలకు మారు పేరుగా మారిన డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ పై వేటు పడింది. యాదవ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టరుగా నియమించారు. ఆయన స్థానంలో డిజిపిగా గిరీష్ కుమార్ నియమితులయ్యారు.

ఇంటలిజెన్స్ చీఫ్ గా అరవిందరావు స్థానంలో మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. అరవింద రావును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఇటీవల వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో విమర్శలు ఎదుర్కున్న అరవింద్ రావు తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆర్టీసి ఎండిగా ఉన్న దినేష్ రెడ్డిని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంటే డిజిగా నియమించారు.

రాష్ట్రం వరద తాకిడికి గురై విలవిలలాడుతున్న సమయంలో కూడా డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ కనిపించకుండా పోయారు. ఆయన ఏం చేస్తున్నారనేది ముఖ్యమంత్రికి కూడా తెలియని స్థితి వచ్చిందంటారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎస్ఎస్పీ యాదవ్ మొదటి నుంచీ వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X