హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊహాగానాలకు జూ. ఎన్టీఆర్ తెర

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: తాను విధేయతలను మార్చినట్లు సాగుతున్న ప్రచారానికి తెర వేసేందుకు ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ పూనుకున్నారు. ఆయన బుధవారం ఉదయం వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్టుకు 20 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన చెక్ ను అందజేశారు.

జూనియర్ ఎన్టీఆర్ మంగళవారంనాడు ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయల విరాళాన్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చంద్రబాబుకు దూరమైనట్లు ప్రచారం సాగింది. పైగా, జూనియర్ ఎన్టీఆర్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావుతో కలిసి సచివాలయానికి వచ్చి రోశయ్యను కలవడం దుమారం రేపింది. కాంగ్రెసు పార్టీ దగ్గర కావడానికి ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్ అందుకు పూనుకున్నట్లు భావించారు. ఈ ఊహాగానాలకు తెర వేయడానికి ఆయన బుధవారం చంద్రబాబును కలిసి చెక్కును అందించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X