వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ ప్రమాదం ఇందుకే: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మహబూబ్ నగర్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం రాష్ట్రంలో వ్యవస్థల వైఫల్యం వల్లనే సంభవించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరదల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఆయన ఆ విధంగా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఉదయం గద్వాలలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వ్యవస్థల వైఫల్యానికి వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం నిదర్శనమని, రైల్వైస్ లో పని చేసే వ్యక్తిని ఏవియేషన్ లోకి మార్చారని ఆయన అన్నారు. ఇటీవల వరద తాకిడి ప్రాంతాల పర్యటనకు బయలు దేరే ముందు ముఖ్యమంత్రి రోశయ్య హెలికాప్టర్ పైలట్ గంట ఆలస్యంగా వచ్చాడని, వ్యవస్థల వైఫల్యానికి ఇది అద్దం పడుతోందని ఆయన అన్నారు.

గతంలో పని చేసిన ముఖ్యమంత్రులెవరూ ఇంతగా వ్యవస్థలను నిర్వీర్యం చేయలేదని, బలహీనమైన ముఖ్యమంత్రులున్న కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. వరదలకు సంబంధించి ముందుస్తు హెచ్చరికలు చేయడానికి అవసరమైన వ్యవస్థలున్నాయని, అయితే వాటిని పనిచేయలేని స్థితి కల్పించారని, అందువల్లనే వరదల గురించి ముందస్తుగా ప్రజలను హెచ్చరించి జాగ్రత్త పడేలా చేయలేకపోయారని, దాని వల్లనే వరదల వల్ల ఇంతగా నష్టం సంభవించిందని ఆయన అన్నారు.వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వ యంత్రాంగాలేవీ పని చేయలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాము వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చగలం గానీ సహాయం అందించాల్సింది ప్రభుత్వమేనని, అయితే ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోందని ఆయన అన్నారు. తాము యథాశక్తి సహాయం అందించడానికి కూడా ప్రయత్నిస్తున్నామని, వరద తాకిడి ప్రాంతాలకు తమ పార్టీ బృందాలను పంపిస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X