రేపు ఆంధ్ర వరద ప్రాంతాల్లో ప్రధాని
ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే వరద ప్రాంతాల ఫొటో ప్రదర్శనను చూస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను చూసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో, కర్నాటకలోని రాయచూర్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోతారు. ప్రధానితో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఈ పర్యటనలో ఉంటారు.
Comments
hyderabad హైదరాబాద్ new delhi న్యూఢిల్లీ vijayawada విజయవాడ manmohan singh మన్మోహన్ సింగ్ jaipal reddy జైపాల్ రెడ్డి వరదలు flood water
Story first published: Thursday, October 8, 2009, 11:41 [IST]