మీడియాపై మరోసారి యాదవ్ గుర్రు
డిజిపిగా పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి యాదవ్ మీడియాతో గొడవ పడుతూనే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన మీడియా ప్రతినిధులపై రుసరుసలాడారు. ఇటీవలి తిరుమలలో పురుగులు పడి చస్తారని కూడా ఆయన శాపనార్థాలు పెట్టారు. ఆర్టీసి అధికారులు సూచించినప్పటికీ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి నిరాకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రోశయ్యను కలవడానికి సచివాలయం వచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.
Comments
Story first published: Thursday, October 8, 2009, 14:04 [IST]