వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్లంలో మరో స్వైన్ ఫ్లూ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Swine Flu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో శనివారం మరో స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. తాజాగా శనివారం కర్నాటకలో మోర నలుగురు స్వైన్ ఫ్లూతో మరణించారు. తాజాగా సంభవించిన ఈ ఐదు మరణాలతో దేశంలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించిన వారి సంఖ్య 290కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మూడు స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. అయితే వాటిని ధ్రువీకరించాల్సి ఉంది. లాబొరేటరీ నివేదికల కోసం చూస్తున్నామని అధికారులు చెప్పారు.

తాజాగా దేశంలో మరో 208 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 66, తమిళనాడులో 32, మహారాష్ట్రలో 32, ఆంధ్రప్రదేశ్ లో 24, కర్నాటకలో 18, కేరళలో 13, హర్యానాలో 13 స్వైన్ ఫ్లూ కేసులు తాజాగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వల్ల 3,917 మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా 2,948 మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X