వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో హిజ్బుల్ నేత కాల్చివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Militant
జమ్ము: జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో భారత భద్రతా బలగాలు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ను కాల్చి చంపాయి. ఐదుగురు కుటుంబ సభ్యులను బందీలుగా పట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించిన లియాఖత్ అలీ గుజ్జార్ అలియాస్ జునేద్ ను భారత భద్రతా బలగాలు శనివారం ఉదయం కాల్చి వేశాయి. జునేద్ శుక్రవారం రాత్రి జిల్లాలోని జిద్దాన్ ప్రాంతంలో నూర్ మొహమ్మద్ భట్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఐదుగురు కుటుంబ సభ్యులను బందీలుగా తీసుకున్నాడు.

భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జునేద్ మరణించాడు. మిలిటెంట్ల నుంచి కుటుంబ సభ్యులకు విముక్తి కల్పించాయి. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకే 56 రైఫిల్, మూడు మాగజీన్లు, రెండు గ్రెనేడ్లు, ఒక ఐఇడిలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X