హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరద విరాళాలకు ఎన్నారైల విజ్ఞప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Floods
హైదరాబాద్: రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవడానికి ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టానికి విపరీతంగా కదిలిపోయి సహాయానికి రంగంలోకి దిగింది. ఏడు జిల్లాల్లో సంభవించిన నష్టం పట్ల తాము కదిలిపోయామని సంస్థ తెలిపింది. రేపల్లే వంటి వరద తాకిడి ప్రాంతాలకు ఇప్పటికే తాము సహాయం అందించామని సంస్థ అధ్యక్షుడు నరసయ్య వడ్రాణం చెప్పారు.వరద బాధితులను ఆదుకోవడానికి వ్యక్తిగతంగా, సంస్థాపరంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని సంస్థ అభిప్రాయపడింది.

వరద బాధితుల సహాయార్థం విరాళాలను తమ తమకు పంపాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. వరద బాధితులకు మన సంఘీభావం తెలపాల్సిన కీలక సందర్భంలో ఉన్నామని అభిప్రాయపడింది. తాము వసూలు చేసిన విరాళాలను వరద బాధితుల కోసం వాడుతామని చెప్పింది. వరద బాధితుల కోసం ఒక డాలర్ ఇచ్చినా గొప్ప సాయమేనని చెప్పింది.మీ విరాళాలను ఈ కింది యుఆర్ ఎల్ క్లిక్ చేయండి.www.pravasachiranjeevi.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X