వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనున్నా, ఆదుకుంటా: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
మహబూబ్‌నగర్‌: బాధితులను గతంలో కంటే మెరుగ్గా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలపై దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోశయ్య మాట్లాడారు. ఇళ్లు నష్టపోయిన బాధితులకు త్వరలో నూతన ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఈ సందర్భంగా రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాక సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు అందించిన సేవలు అమూల్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా మిగిలిన పార్టీలు ముందుకు రావాలని సీఎం కోరారు. చిరు వ్యాపారస్తులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రోశయ్య చెప్పారు. ఈ దిశగా బ్యాంకింగ్‌ రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ఆలంపూర్‌ పర్యటనను ముగించుకొని సీఎం నేరుగా కర్నూల్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X