వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలకు మాల్యా విస్కీ సీసాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijay Mallya
న్యూఢిల్లీ: ప్రముఖ మద్యం వ్యాపారి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ మాల్యా పార్లమెంటు సభ్యులకు తనదైన రీతిలో దీపావళి పర్వదినం సందర్భంగా బహుమతులు పంపారు. పార్లమెంటు సభ్యులకు దీపావళి గ్రీటింగ్ కార్డుతో పాటు విస్కీ సీసాలు పంపారు. అయితే కొంత మంది సభ్యులు ఆ బహుమతులను వెనక్కి పంపారు. రాజ్యసభ, లోకసభ పార్లమెంటు సభ్యులకు ఆయన బ్లాక్ డాగ్ విస్కీ సీసాలు పంపినట్లు తెలుస్తోంది. చాలా మంది దాని రుచి చూసే ఉంటారు. కానీ బిజెపి పార్లమెంటు సభ్యుడు ప్రభాత్ ఝా మాత్రం మాల్యాకు ఓ లేఖ రాశారు.

మీరు పంపిన బహుమతి నా జీవనశైలికి సరిపడదు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు పంపినప్పటికీ భారత సమాజం దాన్ని అంగీకరించదు అని ఆయన ఆ లేఖలో రాశారు. చాలా మంది మద్యం సేవిస్తూ ఉండవచ్చు కానీ మీలాంటి గౌరవప్రదమైన వ్యక్తులు పార్లమెంటు, పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగాల హుందాతనాన్ని మనసులో పెట్టుకుని ఉండాల్సిందని అన్నారు.

తనెవరో తెలియకుండా మాల్యా తనకు బహుమతి పంపడం పట్ల ఆయన తన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు కూడా. భారత పార్లమెంటేరియన్లకు అటువంటి బహుమతులు పంపకూడదని ఆయన సలహా ఇచ్చారు. తన ఇంటిలో ఇంకా కొంత సంస్కృతి మిగిలి ఉందని, మద్యం సేవించడం సమస్యలను సృష్టించడమే తప్ప సమస్యలను పరిష్కరించదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X