ప్రభుత్వోద్యోగులకు దీపావళి తీపి కాన్క
గురువారంనాటి మంత్రివర్గంలో ప్రధానంగా వరద సహాయ చర్యలపైనే చర్చ జరిగింది. వరదల్లో 90 మంది మరణించినట్లు మంత్రి వర్గం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ తెల్లకార్డుల దుర్వినియోగంపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉప సంఘాన్ని వేయాలని నిర్ణయించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు. వరద ప్రాంతాల్లో ఇన్ పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వరద బాధితుల కోసం మంత్రులు 50 వేల రూపాయలేసి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆమె చెప్పారు.
సుంకేశుల బ్యారేజీ నుంచి కర్నూలు పట్టణానికి మూడు రోజుల్లో నీటిని విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. అనంతపురం జిల్లాలోని శ్రీరాంరెడ్డి మంచినీటి పథకం నాలుగవ దశ పనులకు ఆమోదం తెలిపినట్లు ఆమె చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు అదనంగా 75 ఉద్యోగులను నియమించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.