హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వోద్యోగులకు దీపావళి తీపి కాన్క

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 8.47 శాతం కరువు భత్యం (డిఎ) ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల మంత్రి జె.గీతారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. పెంచిన డిఎను ఈ ఏడాడి జులై నుంచి వర్తింపజేస్తారు. అక్టోబర్ వరకు పెరిగిన డిఎను జిపిఎఫ్ లో కలుపుతారు. నవంబర్ నెల నుంచి పెరిగిన డిఎను జీతంతో కలిపి ఇస్తారు. డిఎ పెంపు వల్ల ఏడాదికి రూ. 1165.23 కోట్ల అదనపు భారం పడుతుంది.

గురువారంనాటి మంత్రివర్గంలో ప్రధానంగా వరద సహాయ చర్యలపైనే చర్చ జరిగింది. వరదల్లో 90 మంది మరణించినట్లు మంత్రి వర్గం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ తెల్లకార్డుల దుర్వినియోగంపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉప సంఘాన్ని వేయాలని నిర్ణయించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు. వరద ప్రాంతాల్లో ఇన్ పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వరద బాధితుల కోసం మంత్రులు 50 వేల రూపాయలేసి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆమె చెప్పారు.

సుంకేశుల బ్యారేజీ నుంచి కర్నూలు పట్టణానికి మూడు రోజుల్లో నీటిని విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. అనంతపురం జిల్లాలోని శ్రీరాంరెడ్డి మంచినీటి పథకం నాలుగవ దశ పనులకు ఆమోదం తెలిపినట్లు ఆమె చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు అదనంగా 75 ఉద్యోగులను నియమించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X