వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్చిరోలీలో రీపోలింగ్: నక్సల్స్ దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
నాగపూర్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల రీపోలింగ్ జరుగుతున్న కోట్మీ పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు గురువారం దాడి చేశారు. వారు పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు ఎదురు కాల్పులతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఈ ప్రాంత కసన్సూర్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరు వైపులా ఏ విధమైన ప్రాణనష్టం సంభవించలేదు.

గడ్చిరోలీ జిల్లాలోని అహేరీ తాలూకాలోని కోట్మీతో పాటు 13 పోలింగ్ కేంద్రాల్లో గురువారం రీపోలింగ్ జరిగింది. నక్సల్స్ అడ్డుకోవడంతో ఈ నెల 13వ తేదీన పోలింగ్ సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోయారు. నక్సలైట్లు రోడ్లను తవ్విపోశారు, రోడ్లపై చెట్లను నరికివేశారు. దాంతో రీపోలింగ్ కు ఆదేశించారు. గడ్చిరోలీ జిల్లాలో గురువారం మొత్తం 22 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X