హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం షాపులన్నీ నా తాగుడుకేనా?: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: దేశంలోని మద్యం షాపులన్నీ తన కోసమే ఉన్నాయా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అడిగారు. కెసిఆర్ తాగుబోతు అని వస్తున్న విమర్శలకు ఆయన ఆ విధంగా ఎదురు ప్రశ్న వేశారు. టీవీ 9 సిఇవో రవి ప్రకాష్ బస్తీ మే సవాల్ లోపలి మనిషి పేర నిర్వహించిన కార్యక్రమంలో ఆ ప్రశ్న వేశారు. తాను మద్యం సేవించడం మానేశానని, డాక్టర్ రావు ఇచ్చిన సలహా మేరకు ఆరోగ్యం కోసం మద్యం సేవించడం మానేశానని ఆయన చెప్పారు. ధూమపానం కూడా మానేస్తానని ఆయన అన్నారు. కెసిఆర్ తాగుబోతు అని వస్తున్న విమర్సలపై కెసిఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సన్నాసుల చేత మీడియా తనపై విమర్శలు చేయించి ప్రసారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ ద్రోహం చేశారని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా కెసిఆర్ రాక ముందు ఉద్యమం ఉప్పెనలాగా ఉంది, ఇప్పుడు ఏమీ లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సన్నాసులే తనను వదిలి వెళ్లారని, పిడికెడు మంది పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమం దీర్షకాలికమైందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అన్ని వేళలా తాను నిలదీశానని ఆయన చెప్పారు. మీడియా తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే చాలా మంది నాయకులు ఎక్కుడ ఉండేవారని ఆయన అన్నారు.

తనపై దొర అన్న విమర్శలు రావడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కెసిఆర్ ఏది చేసినా దొరగానే చేశారని, దాచుకోవడం చేత కాదని ఆయన అన్నారు. తాను డబ్బులు కోసం ఉద్యమం నడపాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తాను పుట్టుకతోనే ధనవంతుడనని, వందలాది ఎకరాల భూమి ఉండేదని, మూడంతస్థుల భవంతిలో పుట్టానని ఆయన అన్నారు. తన కుమారుడు ఉద్యమం కోసం పనిచేస్తున్నాడని, బ్యాంక్ బ్యాలెన్స్ లు లేకుండా చేసుకున్నారని, ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉందని, తన కుమారుడు రామారావు వ్యక్తిస్వేచ్ఛను హరించడం భావ్యం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X